Tuesday, May 7, 2019

IPL T20 CRICKET 1st Final Team MI

              క్వాలిఫై 1లో తడబడిన చెన్నై 

చెన్నైను  చెన్నైలో ఓడించడం చాలా కష్టం. అలాంటిది చెన్నైని దాని సొంతగడ్డపై ఈ ఐపీఎల్‌లో రెండోసారి మట్టికరిపించింది ముంబయి ఇండియన్స్‌. మంగళవారం జరిగిన క్వాలిఫయర్‌-1లో ముంబయి 6 వికెట్ల తేడాతో గెలిచింది. స్పిన్నర్లు రాహుల్‌ చాహర్‌ (2/14), కృనాల్‌ పాండ్య (1/21), జయంత్‌ యాదవ్‌ (1/25) మాయాజాలానికి తడబడిన చెన్నై మొదట 4 వికెట్లకు 131 పరుగులే చేసింది. రాయుడు (42 నాటౌట్‌; 37 బంతుల్లో 3×4, 1×6), ధోని (37 నాటౌట్‌; 29 బంతుల్లో 3×6) రాణించారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (71 నాటౌట్‌; 54 బంతుల్లో 10×4) సూపర్‌ బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని ముంబయి.. 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. సూర్యకుమార్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ సీజన్‌లో చెన్నైతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబయి గెలవడం విశేషం.చెన్నై ఫైనల్ చేరడానికి మరో అవకాశం ఉంది.ఆదే ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుతో ఆడాలి అందులో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది .


Tags :  ipl t20 cricket  mi vs csk 

No comments:

Post a Comment