Thursday, April 4, 2019

Sunrisers Top

 దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. పిచ్‌ నెమ్మదిగా ఉండటంతో స్వల్పలక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడ్డారు. 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్‌ ఓపెనర్లు బెయిర్‌స్టో(48), డేవిడ్‌వార్నర్‌ (10) శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 64 పరుగులు జోడించి సన్‌రైజర్స్‌ విజయానికి బాటలు వేశారు. ఆపై  బెయిర్‌స్టో, వార్నర్‌ వెనువెంటనే ఔట్‌ కాగా విజయ్‌శంకర్(16)‌, మనీశ్‌పాండే(10) సింగిల్స్‌ తీస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వరుసగా మూడు వికెట్లు పడడంతో బ్యాట్స్‌మెన్‌ నెమ్మదించారు. ఆఖర్లో యూసుఫ్‌ పఠాన్‌(9), మహ్మద్‌ నబీ(17) లాంఛనాన్ని పూర్తిచేసి జట్టుని గెలిపించారు.
అంతకుముందు దిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(43) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌కు మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. చివర్లో అక్షర్‌ పటేల్‌ (23) ఒక ఫోర్‌, రెండు సిక్సులు బాదడంతో దిల్లీ గౌరవప్రదమైన స్కోర్‌ సాధించింది

No comments:

Post a Comment