Sunday, April 7, 2019

IPL T20 Cricket

     
ఏడాది ఐపీఎల్‌ టోర్నీలో ఎంత చిన్న లక్ష్యమైనా 15 ఓవర్లు దాటందే ముగియలేదు.. కానీ 140 పరుగు లక్ష్యాన్ని కేవలం 13.5 ఓవర్లలోనే ఊదేసింది కోల్‌కతా నైట్‌రైడర్స్‌. భీకర ఫామ్‌లో ఉన్న రసెల్‌ బరిలో దిగలేదు... నితీష్‌ రాణా లాంటి కుర్రాళ్లకు బ్యాట్‌ పట్టుకోవాల్సిన అవసరమే రాలేదు. కారణం క్రిస్‌ లిన్‌ (50; 32 బంతుల్లో 6×4, 3×6), సునీల్‌ నరైన్‌ (47; 25 బంతుల్లో 6×4, 3×6)..! ఈ ఓపెనింగ్‌ జోడీ సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తించడంతో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలిచిన కోల్‌కతా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది

బెంగుళూరు డబుల్ హ్యాట్రిక్ 
ఎంతో అద్భుతంగా ఆడితే తప్ప, ఎంతో అదృష్టం కలిసొస్తే తప్ప ఆ జట్టిక నాకౌట్‌ రేసు నుంచి నిష్క్రమించినట్లే. చెత్త ప్రదర్శనను కొనసాగించిన కోహ్లి జట్టు ఐపీఎల్‌-12లో వరుసగా ఆరో పరాజయం చవిచూసింది. దిల్లీ క్యాపిటల్స్‌ చేతిలోనూ ఓడింది. ఇప్పటివరకు గెలుపు రుచి చూడలేకపోయిన బెంగళూరు.. ఓటమి నంబర్‌-6తో పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. తర్వాతి దశకు అర్హతకు పోటీ ఉండాలంటే మిగిలిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు నెగ్గాల్సిందే







#Tags IPL  Cricket  #IPL T20 #Cricket 
CSK KKR K11P CRB DC SHE RR MI 

No comments:

Post a Comment