ఉత్కంఠ భరితమైన మ్యాచ్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో మ్యాచ్లో మొదట సన్రైజర్స్ హైదరాబాద్ 150 పరుగులే చేసింది. కానీ కష్టంగా ఉన్న పిచ్పై.. బలమైన సన్రైజర్స్ బౌలింగ్ను దృష్టిలో ఉంచుకుంటే పంజాబ్కు ఛేదన అంత సులభం కాదేమో అనిపించింది. కానీ కేఎల్ రాహుల్ (71 నాటౌట్; 53 బంతుల్లో 7×4, 1×6) మెరుపులతో కింగ్స్ ఎలెవన్ 17 ఓవర్లకు 132/1తో విజయం దిశగా సాగింది. ఐతే ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్ను సన్రైజర్స్ బౌలర్లు అద్భుత బౌలింగ్తో ఉత్కంఠభరితంగా మార్చేశారు. చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి రాగా.. ఒత్తిడిని అధిగమిస్తూ రాహుల్ జట్టును గెలిపించాడు. సన్రైజర్స్కు ఇది వరుసగా రెండో ఓటమి. మొత్తంగా మూడోది.
#Tags ipl t20 kings11punjab sunrise hyderabad cricket
No comments:
Post a Comment