ఒక్క పరుగు తేడాతో గెలిచిన బెంగుళూరు
చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క పరుగుతో గెలిచింది. ధోనీ(84, 48 బంతుల్లో 5x4, 7x6) కెప్టెన్ ఇన్నింగ్స్తో బెంగళూరును ఓడించినంత పని చేశాడు. అతడికి అంబటిరాయుడు(29) మినహా మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ సహకరించలేదు. దీంతో చెన్నై జట్టు చివరి బంతివరకూ పోరాడి ఒక్క పరుగుతో ఓడిపోయింది. చివరి ఓవర్లో 24 పరుగులు అవసరం కాగా ధోనీ మూడు సిక్సులు, ఒక ఫోర్ కొట్టి మ్యాచ్ను గెలిపించినంత పనిచేశాడు. అయితే చివరి బంతికి రెండు పరుగులు చెయ్యాల్సిన స్థితిలో పార్థివ్పటేల్ ఠాకుర్ని రనౌట్ చేశాడు. దీంతో బెంగళూరు విజయం సాధించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ(9) తక్కువ స్కోరుకే ఔటైనా మరో ఓపెనర్ పార్థివ్పటేల్ (53, 37 బంతుల్లో 2x4, 4x6) ధాటిగా ఆడి అర్ధశతకం సాధించాడు. అతడికి ఏబీ డివిలియర్స్(25), అక్ష్దీప్నాథ్(24), మార్కస్స్టోయినిస్(14) సహకారం అందించారు. చివర్లో మొయిన్ అలీ(26, 16 బంతుల్లో 5x4) దూకుడుగా ఆడి బెంగళూరు స్కోరును 160 దాటించాడు. కాగా చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, బ్రావో రెండేసి వికెట్లు తీయగా ఇమ్రాన్ తాహిర్ ఒక వికెట్ తీశాడు
Tags: IPL T20 CRICKET RCB VS CSK
No comments:
Post a Comment