Sunday, April 21, 2019

ఉపాసన నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది

              ఉపాసన గురించి రామ్ చరణ్ 

ఉపాసన అవార్డు పట్టుకున్న ఫొటోను చెర్రీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘డియరెస్ట్‌ ఉప్సీ.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఫిలాన్‌త్రోపిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు కంగ్రాట్స్‌’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 46 వేల మందికి పైగా లైక్‌ చేశారు.
అవార్డు అందుకున్న సందర్భంగా ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘చాలా సంతోషంగా ఉంది. సోషల్‌మీడియాలో నాకు మెసేజ్‌లు చేస్తూ, నన్ను మోటివేట్‌ చేస్తున్నవారికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నేను చేపట్టిన ప్రతి కార్యక్రమానికి నా వెన్నంటే ఉంటూ మద్దతుగా నిలిచిన నా కుటుంబానికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
Tags:  Ram Charan Tej   Upasana                             Facebook  Social Media 


No comments:

Post a Comment