Tuesday, April 16, 2019

రాజస్థాన్ పై పంజాబ్ విజయం

                         ప్చ్ రాజస్థాన్ 


రాజస్థాన్‌ రాయల్స్‌కు మరోసారి అదృష్టం కలిసిరాలేదు. ఆది నుంచి గెలుపు బాటలో పయనించి ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. అర్షదీప్‌, అశ్విన్‌, షమి తలో రెండు వికెట్లు తీయడంతో రాజస్థాన్‌ కుదేలైంది. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేసింది.
ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి (50; 45 బంతుల్లో 4×4), జోస్‌ బట్లర్‌ (23; 17 బంతుల్లో 1×4, 2×6) శుభారంభం అందించారు. సంజూ శాంసన్‌ (27; 21 బంతుల్లో 2×4) ఆకట్టుకున్నాడు. దీంతో 15 ఓవర్లకు రాజస్థాన్‌ 122/2తో విజయం వైపు పయనిస్తున్నట్టే అనిపించింది. ఆ తర్వాత ప్రతి పది పరుగుల వ్యవధిలో ఓ వికెట్‌ చేజార్చుకోవడంతో ఓటమి పాలైంది. అజింక్య రహానె (26; 21 బంతుల్లో 1×4) వేగంగా ఆడలేదు. జోఫ్రా ఆర్చర్‌ (1), ఆస్టన్‌ టర్నర్‌(0) నిరాశపరిచారు. చివర్లో స్టువర్ట్‌ బిన్నీ (33; 11 బంతుల్లో 2×4, 3×6) మెరిసినా అప్పటికే ఆలస్యమైంది. అంతకుముందు పంజాబ్‌లో కేఎల్‌ రాహుల్‌ (52), క్రిస్‌గేల్‌ (30), మయాంక్‌ అగర్వాల్‌(26), డేవిడ్‌ మిల్లర్‌ (40) రాణించారు
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రవిచంద్రన్ ఆశ్విన్ .


Tags :  IPL  T20 CRICKET  IPL CRICKET 


No comments:

Post a Comment