9999 10 Loc Rupees
ఖైరతాబాద్లోని సెంట్రల్జోన్లో రవాణాశాఖ సోమవారం నిర్వహించిన నంబర్ల వేలం ద్వారా ఒకే రోజు రూ.30,55,748లక్షల రాబడి లభించింది. ఒక్క 9999 నంబరు రూ.10లక్షలు పలికింది. ప్రస్తుతం ముగుస్తున్న సీరీస్ టీఎస్09 ఎఫ్ఈలో 9999 నంబరును ఎన్ఎస్ఎల్ ప్రాపర్టీస్ సంస్థ రూ.10లక్షలు చెల్లించి కైవసం చేసుకుంది. పాత సీరీస్ ముగిసి కొత్త సీరీస్ అయిన ‘టీఎస్09 ఎఫ్ఎఫ్’లోకి అడుగు పెట్టింది. అందులో 1 నంబరును ఎఫ్ఆర్ఆర్ హిల్ హోటల్స్ రూ.6.95లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. 99 నంబరును ఎమర్జిన్ అగ్రినోవో సంస్థ రూ.2.78లక్షలు చెల్లించి దక్కించుకుంది. ఇక్కడ 9 సంఖ్యకు బాగా డిమాండ్ ఉన్నా ఈ పర్యాయం అధికారులు నిర్ణయించిన రూ.50వేలకే పోవడం గమనార్హం.
కొత్త సీరీస్ ప్రారంభం కావడంతో ఎంతో డిమాండ్ ఉన్న 0001 కోసం ఓ వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేశారు. సాధారణంగా ఫ్యాన్సీ నంబరును కోరుకున్న వారు దాని కోసం అధికారులు నిర్ణయించిన కనీస ధరతో పాటు అధనంగా వారికి ఇష్టమైన మొత్తాన్ని చెక్కుల రూపంలో టెండర్ బాక్సులో వేయాలి. నిర్ణీత సమయంలో నలుగురు టెండర్ వేశారు. టెండర్ బాక్సులోని కవర్లు తీసుకెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి తన కవరును వేసే ప్రయత్నం చేశాడు. అప్పటికే వేసిన వ్యక్తి అభ్యంతరం చెప్పడంతో దాడి చేశాడు. అధికారులు ఆ దరఖాస్తును తిరస్కరించారు
Tags: fancy number
No comments:
Post a Comment